Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:08 IST)
కేంద్ర మంత్రుల్లో మచ్చలేని వారిలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఒకరు. ఈయన తాజాగా తన క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించారు. తన క్లాస్‌మేట్ ఓ మోసగాడని తెలిసి అతనిపై కేసు పెట్టించిమరీ అరెస్టు చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరానికి చెందిన మాటుంగ ప్రాంత వ్యక్తి, జ్యోతి కుమార్ అగర్వాల్ (50) అనే వ్యక్తి పియూష్ గోయల్ స్కూల్‌మేట్. చిన్నప్పుడు వారిద్దరూ కలిసి చదువుకున్నారు. గత యేడాది సెప్టెంబరు నెలలో తన స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగగా, పియూష్ గోయల్ హాజరయ్యారు. అపుడు జ్యోతి కుమార్ తనను తాను పరిచయం చేసుకుని ఫోటోలు దిగాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలు చూపిస్తూ పలువురుని మోసం చేయసాగాడు. మనీష్ చగన్ లాల్ అనే వ్యక్తికి వాటిని చూపించి, పియూష్‌తో మాట్లాడి, రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. పియూష్‌కు దీపావళి కానుకను పంపుదామని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. 
 
ఆపై కాంట్రాక్ట్ మాటెత్తకపోవడంతో, తనకున్న పరిచయాలతో పియూష్‌ను మనీష్ సంప్రదించి, జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో జ్యోతికుమార్ మోసగాడని, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పియూష్ స్వయంగా ముంబై పోలీసులను ఆదేశించారు. దీంతో కదిలిన పోలీసులు, జ్యోతికుమార్ అగర్వాల్‌పై కేసు పెట్టి అరెస్టు చేయించాడు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments