Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనంలో ఆగిపోయిన ఇంజన్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
శనివారం, 21 మే 2022 (09:29 IST)
ఎయిర్ ఇండియా విమానానికి పెను ముప్పు తప్పింది. ముంబై నుంచి బెంగుళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గగనతలంలో ఉండగానే ఒక్కసారిగా ఆ విమానం ఇంజిన్ ఒకటి మొరాయించింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గురువారం ఉదయం 9.43 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం బెంగుళూరుకు బయలుదేరింది. 
 
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పని చేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, సమాచారాన్ని విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో బెంగుళూరుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments