Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను కాటేసిన తండ్రి.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలిక!!

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (09:56 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డపాలిట కామాంధుడయ్యాడు. తన లైంగికవాంఛను తీర్చుకునేందుకు మైనర్ అయిన తన కుమార్తెను లొంగదీసుకున్నాడు. చివరకు కన్నతండ్రి చేసిన ఘాతుకానికి 17 యేళ్ల బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణం ముంబై మహానగరంలోని పంత్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 45 యేళ్ల ఓ వ్యక్తి తన కుమార్తెను గత 2018 మార్చి నెలలో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తరచుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చింది. ఇంత జరిగినా భర్త బాగోతాన్ని అతని భార్య పసిగట్టలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఆ మైనర్ బాలిక ఇటీవల రాజావాడీ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2018 మార్చి నుంచి ఈ ఏడాది జూన్ వరకు తన తండ్రి బెదిరించి అత్యాచారం చేశాడని, దీంతో తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చానని కుమార్తె వైద్యులు, పోలీసులకు చెప్పింది. 
 
కూతుర్ని తల్లిని చేసిన కామాంధుడైన తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376, సెక్షన్ 4,6,8,10,12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేస్తామని ముంబై పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments