Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిటికల్ కేర్ యూనిట్‌లో ములాయం సింగ్ : మేదాంత ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (10:58 IST)
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వృద్ధనేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ములాయం సింగ్‌కు కిడ్నీలు పాడైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కిడ్నీలు దానం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. అదేసమయంలో కార్యకర్తలు నేతాజీ అని ముద్దుగా పిలుచుకునే ములాయంను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ కోరింది. 
 
ప్రస్తుతం వెంటిలేటర్‌పై ములాయం సింగ్‌కు ఐసీయూ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ కోరింది. అదేసమయంలో నేతాజీ ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments