Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ జన్మభూమి ట్రస్టుకు ముఖేశ్ అంబానీ భారీ విరాళం

వరుణ్
మంగళవారం, 23 జనవరి 2024 (10:21 IST)
అయోధ్య రామ జన్మభూమి ట్రస్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరళాన్ని ప్రకటించారు. అంబానీ కుటుంబ సభ్యులు కలిసి ఈ ట్రస్ట్‌కు ఏకంగా రూ2.51 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళం అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్యానించారు. కాగా, సోమవారం అయోధ్య నగరంలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహా ఘట్టానికి ముఖేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత తమ కుటుంబం తరపున ఆయన భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ప్రటించి, ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
"ముఖేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సోమవారం అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ముఖేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ, కుమారులు అకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతాలతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమాల్ పాల్గొన్నారు. అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించి  ప్రముఖుల్లో వీరంతా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments