Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంవోలో విజయసాయిరెడ్డి.. మీడియాను చూసి పరుగో పరుగు.. ఎందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం ఎదురుచూస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే.. వైకాపా ఎంపీలు మోదీ దృష్టి తమపై పడాలని ఎగబడుతున్నారు. ఈ క్రమంల

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (14:24 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం ఎదురుచూస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే.. వైకాపా ఎంపీలు మోదీ దృష్టి తమపై పడాలని ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానిని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. పీఎంవోలో గంటపాటు నిరీక్షించారు. 
 
పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి మోదీ అపాయింట్‌మెంట్ కోసం వేచి వున్నారు. కానీ ఆ సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో వారిని చూసి విజయసాయి రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు విజయసాయి వెంట వైకాపా చీఫ్ జగన్ బంధువు వినీత్ రెడ్డి పీఎంవోలోకి వెళ్లారు. కాగా వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
 
కాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు ఇలా పాకులాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలకే విసుగొచ్చేలా విమర్శలు చేసే వైసీపీ విశ్వాస వాసి.. కత్తి మహేష్ విజయసాయి రెడ్డి పీఎంవోకు ఎందుకు వెళ్లారో స్పందించే సంతోషిస్తామని ఓ నెటిజన్ సెటైర్లు విసురుతూ.. విజయసాయి రెడ్డి ఫోటోను పోస్టు చేశాడు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments