Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు క్లిక్ చేసేవారు రూ.100 పార్టీ ఫండ్‌గా ఇవ్వాలి : ఎంపీ మంత్రి

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:36 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రిగా ఉన్న ఉషా ఠాకూర్ పార్టీ కార్యకర్తలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనతో సెల్ఫీ దిగాలనుకుంటే వంద రూపాయలు చెల్లించాలని అభిమానులకు, కార్యకర్తలకు చెప్పారు.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'మిత్రులారా, సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని మీకు తెలుసు. దీని వల్ల కొన్నిసార్లు మాకు చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరైతే సెల్ఫీలు క్లిక్ చేస్తారో వారు స్థానిక పార్టీ యూనిట్‌ కోశాధికారికి రూ.100 జమ చేయాలి. ఇలా సమకూరిన డబ్బును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చు' అని తెలిపారు.
 
అంతేకాకుండా, బహిరంగ కార్యక్రమాలకు తనను పిలిచే వారు పుష్పగుత్తులకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మరోవైపు ఈ బీజేపీ మంత్రి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్న ప్రజలు పీఎం కేర్స్‌ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments