ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారాల పురుగు అని పోలీసుల విచారణలో తేలింది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గత చరిత్రను విచారిస్తుంటే, పోలీసులే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శివకుమార్ తమను అత్యాచారం చేశాడంటూ ఇప్పటివరకూ 6 ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
తనను 'అత్తా' అని పిలుస్తూ, ఓ రోజు రాత్రి శివకుమార్ తనపై అత్యాచారం చేశాడని, బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని బాధను దిగమింగానని 46 ఏళ్ల మహిళ ఒకరు వాపోయారు.
రాంనగర్ పరిధిలో మరో ఇద్దరు యువతులపై కూడా శివకుమార్ అత్యాచారం చేశాడని తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు శివకుమార్పై కేసు పెట్టగా, అది ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. 2011లో గుర్గావ్లో బార్ డాన్సర్పై అత్యాచారం సహా అతనిపై ఇప్పుడు మొత్తం 6 కేసులు ఉన్నాయి.
మరో మహిళ తన బాధను తెలుపుతూ, "2013లో ఇదే శివకుమార్ గన్ పాయింట్ సమీపంలో అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే, దాన్ని స్వీకరించేందుకు వారు నిరాకరించారు" అని వివరించింది. కాగా, పోలీసులు ఇప్పుడా కేసులన్నింటినీ తిరగదోడే పనిలో బిజీగా ఉన్నారు.