Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గపు తండ్రి : అన్నం పెట్టలేదని కత్తితో పొడిచాడు..!

నేరాలు, ఘోరాలకు నిలయంగా మారుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. సమయానికి అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో కన్నకూతురిని కత్తితో పొడిచాడో కసాయి తండ్ర

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (05:56 IST)
నేరాలు, ఘోరాలకు నిలయంగా మారుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. సమయానికి అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో కన్నకూతురిని కత్తితో పొడిచాడో కసాయి తండ్రి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మొరాదాబాద్, బంగ్లా గ్రామంలో నివసిస్తున్న నన్హే అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిస అయిన నన్హే ఇంటికి మందుతాగి వచ్చాడు. అన్నం పెట్టమని 15ఏళ్ల కుమార్తెను అడిగాడు. ఆమె ఇంటి పనులు చేస్తుండటంతో అన్నం వడ్డించడం కొద్దిగా ఆలస్యమైంది. దీంతో ఆగ్రహావేశానికి గురైన నన్హే కుమార్తెను కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. కసాయి తండ్రి కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments