Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. ముగ్గురు స్నేహితులతో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి!

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (10:14 IST)
ఓ యువతి ప్రేమ పేరుతో తన ప్రియుడి చేతిలో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా కూడా దగ్గరైంది. కొంతకాలం వాడుకున్న తర్వాత ఆ ప్రియుడు తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు. తన ముగ్గురు స్నేహితులతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. లేకపోతే, నగ్న ఫోటోలు బయటపెడతానని, అవి బయటపెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ప్రియుడు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి.. వంతెనపై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన షాదాబ్ అనే యువకుడు ఓ యువతిని వెంటపడీమరీ ప్రేమించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొంతకాలం హాయిగా గడిపారు. అయితే ఆమెకు తెలియకుండా యువతి అసభ్యకర చిత్రాలను చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. 
 
తన ముగ్గురు స్నేహితులను పిలిచి ఆమెకు పరిచయం చేశాడు. వారితో సెక్స్ చేయాలని, లేదంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని బెదిరించసాగాడు. లేదంటే ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. 
 
ప్రేమించిన వాడు ఇంతలా మోసం చేయడంతో ఏం చేయాలో తెలియని ఆ యువతి.. మరణమే శరణ్యం అనుకొని ఒక వంతెన ఎక్కి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె నడుం దగ్గర నుంచి కింది శరీరం పారలైజ్ అయిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం