Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 కోట్లు గెలుచుకున్న 11 మంది మహిళలు

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (09:19 IST)
కేరళకు చెందిన 11 మంది మహిళలకు అదృష్ణం అనూహ్యంగా వరిచింది. వారంతా రాత్రికి రాత్రి వారంతా లక్షాధికారులైపోయారు. రూ.250 లాటరీ టిక్కెట్టును 11 మంది డబ్బులు పోగేసి మరీ కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ డ్రా తగిలింది. దీంతో వారు కోట్లాది రూపాయలను గెలుచుకున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని పరప్పన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించిన రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించే పనులు చేస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం. ముఖ్యంగా వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ బంపర్ డ్రా లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే, వారివద్ద కేవలం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంట్ లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. 
 
దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments