యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్ర

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (12:56 IST)
పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్రకటించి యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణాలిచ్చింది. ఈ ఘటన కోల్‌కతాలోని కాశీపుర్ ప్రాంతంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో యజమాని ఇంటిలోకి చొరబడిన దొంగలపై వానరం దాడికి దిగింది. పావురాలను దొంగలించేందుకు వచ్చిన వారికి చుక్కలు చూపించింది. కాశీపూర్‌లో విక్కీ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో కొన్ని పావురాలతో పాటు ఈ వానరాన్ని కూడా పెంచుకుంటున్నాడు. 
 
కానీ పావురాలను దొంగలించేందుకు ఇంట్లోకి దొంగలు పడ్డారు. వీరిని గమనించిన వానరం వారితో పోటీపడి పావురాలను కాపాడింది. దీంతో వారు పావురాలను తీసుకెళ్లలేకపోయారు. కానీ వానరాన్ని మాత్రం దొంగలు చంపేశారు. దీంతో యజమాని కలతచెంది, ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments