Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్ర

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (12:56 IST)
పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్రకటించి యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణాలిచ్చింది. ఈ ఘటన కోల్‌కతాలోని కాశీపుర్ ప్రాంతంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో యజమాని ఇంటిలోకి చొరబడిన దొంగలపై వానరం దాడికి దిగింది. పావురాలను దొంగలించేందుకు వచ్చిన వారికి చుక్కలు చూపించింది. కాశీపూర్‌లో విక్కీ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో కొన్ని పావురాలతో పాటు ఈ వానరాన్ని కూడా పెంచుకుంటున్నాడు. 
 
కానీ పావురాలను దొంగలించేందుకు ఇంట్లోకి దొంగలు పడ్డారు. వీరిని గమనించిన వానరం వారితో పోటీపడి పావురాలను కాపాడింది. దీంతో వారు పావురాలను తీసుకెళ్లలేకపోయారు. కానీ వానరాన్ని మాత్రం దొంగలు చంపేశారు. దీంతో యజమాని కలతచెంది, ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments