Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత్రాచల్ స్కామ్ : బెయిల్‌కు దరఖాస్తు చేసుకోని సంజయ్ రౌత్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:01 IST)
పాత్రాచల్ కుంభకోణం అరెస్టు అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరో 14 రోజుల పాటు జైలులోనే ఉండనున్నారు. ఆయన ఈ కేసులో బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరో 14 రోజుల పాటు జైలు జీవితాన్నే గడపనున్నారు. తొలుత ఆయనకు విధించిన రిమాండ్ సోమవారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచడంతో మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడగించింది. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. 
 
మహారాష్ట్రలో వెలుగు చూసిన పాత్రాచల్ స్కామ్‌లో సంజయ్ రౌత్ పాత్ర ఉందని ఆరోపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన నివాసం, కార్యాలయాల్లో పలు దఫాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత ఆయనపై మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ ముగిసినప్పటికీ కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించిన విషయం తెల్సిందే. 
 
ఆయనకు కస్టడీ సోమవారంతో ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కానందున రౌత్‌ను తిరిగి జ్యూడిషియల్ రిమాండ్‌లోనే ఉంచాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. అదే సమయంలో బెయిల్ ఇవ్వాలంటూ రౌత్ పిటిషన్ దాఖలు చేయడం లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుక చెప్పారు. దీంతో ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు రౌత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments