మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:13 IST)
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇకపై దగ్గు, జలుబు, జ్వారానికి మెడికల్ షాపుల్లో మాత్రలను కొనుగోలు చేసినట్టుగానే కోవిడ్ మాత్రలను కూడా కొనుగోలు చేయొచ్చు. 
 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుఫిరవిర్ మాత్రలు ఇపుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 'మోలు లైఫ్ (200 ఎంజీ) పేరుతో వచ్చిన ఈ మాత్రలు మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సివుంటుంది. ధర రూ.1,399 మాత్రమే. 
 
ఒక్క అట్టపెట్టెలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క పూటకు 800 ఎంజీ డోసు కలిగిన మాత్రలను మింగాల్సివుంటుంది. అయితే, ఈ మాత్రలను వైద్యుల సిఫార్సుతోనే వాడాల్సివుంటుంది. 
 
కరోనాకు మాత్రలు అందుబాటులోకి రావడం మన దేశంలో మాత్రం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను భారత ఫార్మా కంపెనీలు అయిన హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 పార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments