Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:13 IST)
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇకపై దగ్గు, జలుబు, జ్వారానికి మెడికల్ షాపుల్లో మాత్రలను కొనుగోలు చేసినట్టుగానే కోవిడ్ మాత్రలను కూడా కొనుగోలు చేయొచ్చు. 
 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుఫిరవిర్ మాత్రలు ఇపుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 'మోలు లైఫ్ (200 ఎంజీ) పేరుతో వచ్చిన ఈ మాత్రలు మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సివుంటుంది. ధర రూ.1,399 మాత్రమే. 
 
ఒక్క అట్టపెట్టెలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క పూటకు 800 ఎంజీ డోసు కలిగిన మాత్రలను మింగాల్సివుంటుంది. అయితే, ఈ మాత్రలను వైద్యుల సిఫార్సుతోనే వాడాల్సివుంటుంది. 
 
కరోనాకు మాత్రలు అందుబాటులోకి రావడం మన దేశంలో మాత్రం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను భారత ఫార్మా కంపెనీలు అయిన హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 పార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments