Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి ఫోటో తొలగింపు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:13 IST)
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో తొలగించబడింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ కింద భాగంలో మోదీ ప్రచారం చిత్రం వుండేది. ప్రస్తుతం ఈ ఫోటోను తొలగించారు. 
 
ఇంతకు ముందు ఈ ఫోటోపై అత్యున్నత న్యాయస్థానం (ఎస్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై తక్షణమే స్పందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఆ ఫోటో బదులుగా సుప్రీంకోర్టు భవనం ఫోటోను ఉంచారు. 
 
దేశ 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్ల, ఈ-మెయిల్స్‌లో 'సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' నినాదంతో పాటు మోదీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. 
 
కానీ న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తీసి వేయాలని ఎన్‌ఐసీని ఆదేశించడంతో తొలగించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments