Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు రాష్ట్ర విపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడె

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (10:14 IST)
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు రాష్ట్ర విపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ విన్నవించారు. ఈ మేరకు గవర్నర్‌తో స్టాలిన్ శుక్రవారం రాత్రి సమావేశమై విజ్ఞప్తి చేశారు. 
 
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్‌ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 9 నెలలుగా పాలన స్తంభించిపోయిందని, సుస్థిర పాలనకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు స్టాలిన్‌ తెలిపారు. 
 
శాసనసభను సమావేశపరచాలని తాము కోరినట్టు చెప్పారు. రాజ్యాంగానికి లోబడి మంచి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరామనీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒకరిపై ఆరోపణలు చేయడం కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని సత్వరం సమావేశపరిచి బలపరీక్షకు ఆదేశిస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments