Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు అక్కాచెల్లెళ్ళను రేప్ చేశారు.. చంపి నదిలో పారేశారు.. యూపీలో దారుణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి.. ఆపై చంపి మృతదేహాలను నదిలో పారేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (16:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి.. ఆపై చంపి మృతదేహాలను నదిలో పారేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో సైజ్నా గ్రామంలో అన్నదమ్ముల సంతానమైన ముగ్గురు బాలికలు (13, 14, 15) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. వీరు వెళ్లి గంటసేపయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఓ బాలిక (13) తల్లి గ్రామ పరిసరాల్లో గాలించింది. 
 
వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికినా బాలికల ఆచూకీ లభ్యంకాలేదు. ఆ రోజు రాత్రి బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ మరుసటి రోజు శనివారం సమీపంలోని భాక్రా నదిలో ఓ బాలిక మృతదేహం కనిపించిందని గ్రామస్తుడు చెప్పడంతో బాధిత బాలికల కుటుంబ సభ్యులు వెళ్లారు. మృతదేహం తమ అమ్మాయిదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. నదిలో పోలీసులు గాలించగా మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. వీరిని రేప్ చేసి ఆపై చంపి నదిలో పారేసివుంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments