ముగ్గురు అక్కాచెల్లెళ్ళను రేప్ చేశారు.. చంపి నదిలో పారేశారు.. యూపీలో దారుణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి.. ఆపై చంపి మృతదేహాలను నదిలో పారేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి.. ఆపై చంపి మృతదేహాలను నదిలో పారేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో సైజ్నా గ్రామంలో అన్నదమ్ముల సంతానమైన ముగ్గురు బాలికలు (13, 14, 15) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. వీరు వెళ్లి గంటసేపయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఓ బాలిక (13) తల్లి గ్రామ పరిసరాల్లో గాలించింది.
వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికినా బాలికల ఆచూకీ లభ్యంకాలేదు. ఆ రోజు రాత్రి బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ మరుసటి రోజు శనివారం సమీపంలోని భాక్రా నదిలో ఓ బాలిక మృతదేహం కనిపించిందని గ్రామస్తుడు చెప్పడంతో బాధిత బాలికల కుటుంబ సభ్యులు వెళ్లారు. మృతదేహం తమ అమ్మాయిదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. నదిలో పోలీసులు గాలించగా మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. వీరిని రేప్ చేసి ఆపై చంపి నదిలో పారేసివుంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.