8 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటి బయట ఆడుకుంటుంటే..?

Webdunia
గురువారం, 15 జులై 2021 (16:58 IST)
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావట్లేదు. వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. అభంశుభం తెలియని పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
లైంగిక దాడి తర్వాత ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించాడు. నిందితుడికి భార్య కూడా ఉంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం