అతగాడు స్నేహితుడు... నువ్వంటే నాకిష్టమన్నాడు.. నమ్మించాడు. ఆకర్షించాడు. రమ్మని పిలవగానే నమ్మి స్నేహితుడే కదా అని అతని వెంట నడిచింది బాలిక. కానీ అక్కడే మరో నాలుగు తోడుళ్లు కాచుకుని ఉంటాయని అనుకోలేదు. అంతే ఆ కామ తోడేళ్లకు తను బలికాక తప్పలేదు. ఐదుగురు యువకుల చేతిలో గ్యాంగ్ రేప్కు గురైంది. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
అహ్మదాబాద్కు చెందిన 17ఏళ్ల బాలిక, మణినగర్ లోని హోటల్కు స్నేహితుడితో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో ఆ యువకుడు మరో నలుగురు ఫ్రెండ్స్కు ఫోన్ చేసి హోటల్కు రప్పించాడు. వీరంతా కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె శరీరంతో అందరూ ఆడుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు ఐదుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు.