శశి గ్యాంగ్ వల్లే అమ్మ నివాసంలో ఐటీ సోదాలు : మంత్రి జయకుమార్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంలో నివాసం ఉంటున్నారనీ, అందువల్లే ఆ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీ చేయాల్సిన

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (08:29 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంలో నివాసం ఉంటున్నారనీ, అందువల్లే ఆ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమిళనాడు రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ అభిప్రాయపడ్డారు. 
 
శుక్రవారం రాత్రి నాలుగు గంటల పాటు ఐటీ అధికారులు వేదనిలయంలో తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. ఈ తనిఖీలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పందించారు. తమను రాజకీయాలకు దూరం చేసేందుకే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిపై ఆదాయం పన్ను దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 
 
జయ నివాసంపై దాడి చేసిన ఐటీ సిబ్బంది.. భవనంలోని కార్యాలయం విభాగాన్ని, శశికళ ఉపయోగించిన గదిని సోదా చేసినట్టు తెలిసింది. వేదనిలయం ఒకటిన్నర కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు పునీత స్థలం అని చెప్పారు. ఆ స్థలంలోకి ఐటీ అధికారులు వెళ్లడం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. 
 
జయ మరణం తర్వాత, శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులే అక్కడ నివాసం ఉంటున్నారని, ఐటీ దాడులకు వారే కారణమని మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ కూడా ఆరోపించారు. దాడుల సందర్భంగా ఐటీ సిబ్బంది దీప మేనకోడలు దీపను, ఇతర పార్టీ కార్యకర్తలను లోపలికి అనుమతించని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments