ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పన్నీర్ సెల్వం కలిసొచ్చారట... తమిళనాడు మంత్రి వ్యాఖ్య

ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. తమిళనాడు మాజీ సీఎం అయిన పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:18 IST)
ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి.  తమిళనాడు మాజీ సీఎం అయిన పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి వచ్చారని మాట్లాడుతూ.. అందరూ గొల్లున నవ్వుకునేలా చేశారు. 
 
తమిళ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఢిల్లీకి వెళ్లిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపి వచ్చారని ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అనే చెప్పేందుకు బదులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
ఈ నెల 12న పన్నీర్ కొందరు మంత్రులు, అన్నాడీఎంకే నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ల విస్తరణ, డెంగ్యూ జ్వరానికి సంబంధించిన చర్యలపై చర్చించినట్లు చెప్తూ వచ్చిన శ్రీనివాసన్ ప్రధాని పేరును మార్చేయడం నెటిజన్లకు సరైన మేత దొరికినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments