Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటో తరగతిలో చేర్చాలంటే ఆరేళ్లు నిండివుండాలి .. కేంద్రం

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (08:27 IST)
దేశంలో కొత్త జాతీయ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇక నుంచి ఒకటో తరగతిలో చేర్చాలంటే చిన్నారులకు ఆరేళ్లు నిండివుండాలన్న నిబంధన విధించింది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
 
జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుంచి 8వ వయసులో పిల్లకు ఫౌండేషన్‌లో దశలో భాగంగా, మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. ప్రీస్కూలు నుంచి పిల్లలకు ఎలాంటి అవాంతరాలులేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించనున్నారు. ఇది జాతీయ నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశాల్లో ఒకటి. ఇందులోభాగంగా ఆరేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని సూచన చేసింది.
 
ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశ ప్రక్రియలో నిబంధనలు సవరించాలని కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిదిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారు చేసేందుకు వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments