Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటో తరగతిలో చేర్చాలంటే ఆరేళ్లు నిండివుండాలి .. కేంద్రం

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (08:27 IST)
దేశంలో కొత్త జాతీయ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇక నుంచి ఒకటో తరగతిలో చేర్చాలంటే చిన్నారులకు ఆరేళ్లు నిండివుండాలన్న నిబంధన విధించింది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
 
జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుంచి 8వ వయసులో పిల్లకు ఫౌండేషన్‌లో దశలో భాగంగా, మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. ప్రీస్కూలు నుంచి పిల్లలకు ఎలాంటి అవాంతరాలులేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించనున్నారు. ఇది జాతీయ నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశాల్లో ఒకటి. ఇందులోభాగంగా ఆరేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని సూచన చేసింది.
 
ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశ ప్రక్రియలో నిబంధనలు సవరించాలని కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిదిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారు చేసేందుకు వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments