Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి శ్మశానంలో విందు భోజనం... అంత్యక్రియల్లో అరటాకేసుకుని ఆరగించారు...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (15:25 IST)
మన దేశం వివిధ ఆచారాలకు ఆలవాలం అని పెద్దలు చెపుతుంటారు. ఈ ఆచారాల్లో కొన్ని వింత వింత ఆచారాలు కూడా మనకు అక్కడక్కడ దర్శనమిస్తుంటాయి కొన్నిసార్లు. తిరుచ్చి జిల్లా రామనంపట్టి గ్రామ శ్మశానంలో ఇలాంటి వింత ఆచారం ఒకటి వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... ఈ గ్రామంలో ఎవరైనా మరణిస్తే చనిపోయిన తర్వాత 16వ రోజు నిర్వహించే కర్మకాండలో శ్మశానంలో విందుభోజనాలు చేస్తారట. ఈమధ్య ఆ గ్రామంలో 70 ఏళ్ల చిన్నమ్మాళ్ చనిపోయింది. 
 
ఆమె కుమారుడు ఆళగర్ సామి తమ ఆచారం ప్రకారం ఆదివారం నాడు స్వీట్లు ఇంకా ఇతర తినుబండారాలతో 16వ రోజు శ్మశానానికి వెళ్లాడు. ఈ తంతును నిర్వహించేందుకు బంధుమిత్రులు కూడా వచ్చారు. సరిగ్గా అర్థరాత్రి సమయం కాగానే తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలో ఓ పెద్ద అరిటాకును పరిచి అందులో తినుబండారాలన్నిటినీ పెట్టేశాడు. ఆ తర్వాత అక్కడి మట్టితో శివలింగాన్ని, ఆవుడయార్, గుర్రపు బొమ్మలు తయారుచేసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. 
 
అనంతరం తాము అరటాకులో పెట్టిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆకులో ఉన్న పదార్థాలను అంతా కలిసి సామూహికంగా ఆరగించారు. ఈ తంతు ఆదివారం తెల్లవారుజాము వరకూ సాగింది. దీనిపై ఓ పెద్దాయన్ను కదిలిస్తే... ఇది ఇప్పటిది కాదనీ... తరతరాలుగా వస్తున్న ఆచారామని చెప్పుకొచ్చాడు.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments