Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (17:14 IST)
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగికి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. గర్భందాల్చినందునే ఆమెను ప్రస్తుతం ఉన్న జైలుగది నుంచి తరలించనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళ ఖైదీని కూడా తరలించనున్నారు. 
 
"గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపుతాం. బిడ్డ జన్మించేంత వరకు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు" అని జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను తన ప్రియుడితో కలిసి ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. నిందితులిద్దరు ప్రస్తుం జైలులో ఉన్నారు. 
 
ముస్కాన్‌కు ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె గర్భందాల్చినట్టు తెలిసింది. ఆమె గర్భందాల్చడంపై ఇటీవల బాధిత కుటుంబం స్పందించింది. ఒకవేళ బయోలాజికల్‌గా కడుపులోని బిడ్డ సౌరభ్ చెందినది అయితే దత్తత తీసుకుంటామని, ఆ బిడ్డను పెంచుకునేందుకు తమకు ఇష్టమేనని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments