Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 4 వేల మంది మృతి - కొత్త కేసులు 4 లక్షలు

Webdunia
ఆదివారం, 9 మే 2021 (10:27 IST)
దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. శనివారం కొత్త‌గా 4,03,738  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... శనివారం 3,86,444 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 4,092 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,42,362కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. 37,36,648 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు. 
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 30,22,75,471 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,65,428 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments