Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సంగీతంపై 'మీ టూ' దరువు ... ఏడుగురు కళాకారులపై నిషేధం

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:48 IST)
'మీటూ' ఉద్యమం కర్ణాటక సంగీత కళాకారులకూ పాకింది. ఫలితంగా ఏడుగురు కళాకారులపై నిషేధం విధిస్తూ మ్యూజిక్ అకాడెమీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి యేడాది డిసెంబరు నెలలో చెన్నై నగరంలో ప్రతిష్టాత్మక మార్గశిరమాస సంగీతోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సంగీతోత్సవాల్లో వేలాది మంది కళాకారులు పాల్గొంటుంటారు. 
 
ఇందులో పాల్గొనే యువ గాయనీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చిత్రవీణ కళాకారుడు ఎన్‌.రవికిరణ్‌ సహా ఏడుగురు ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు పాల్గొనకుండా మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నిషేధం విధించింది. 'మీ టూ' ఉద్యమం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అకాడమీ అధ్యక్షుడు ఎన్‌.మురళి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
నిషేధం వేటు పడినవారిలో సంగీత కళానిధి బిరుదాంకితుడు చిత్రవీణ రవికిరణ్‌, ప్రముఖ గాత్ర కళాకారుడు ఓఎస్‌ త్యాగరాజన్‌, వయొలిన్‌ విద్వాంసుడు శ్రీరామ్‌, మృదంగ కళాకారులు మన్నార్గుడి ఎ.ఈశ్వరన్‌, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్‌.రమేశ్‌, తిరువారూరు వైద్యనాథన్‌లు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం