Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సంగీతంపై 'మీ టూ' దరువు ... ఏడుగురు కళాకారులపై నిషేధం

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:48 IST)
'మీటూ' ఉద్యమం కర్ణాటక సంగీత కళాకారులకూ పాకింది. ఫలితంగా ఏడుగురు కళాకారులపై నిషేధం విధిస్తూ మ్యూజిక్ అకాడెమీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి యేడాది డిసెంబరు నెలలో చెన్నై నగరంలో ప్రతిష్టాత్మక మార్గశిరమాస సంగీతోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సంగీతోత్సవాల్లో వేలాది మంది కళాకారులు పాల్గొంటుంటారు. 
 
ఇందులో పాల్గొనే యువ గాయనీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చిత్రవీణ కళాకారుడు ఎన్‌.రవికిరణ్‌ సహా ఏడుగురు ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు పాల్గొనకుండా మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నిషేధం విధించింది. 'మీ టూ' ఉద్యమం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అకాడమీ అధ్యక్షుడు ఎన్‌.మురళి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
నిషేధం వేటు పడినవారిలో సంగీత కళానిధి బిరుదాంకితుడు చిత్రవీణ రవికిరణ్‌, ప్రముఖ గాత్ర కళాకారుడు ఓఎస్‌ త్యాగరాజన్‌, వయొలిన్‌ విద్వాంసుడు శ్రీరామ్‌, మృదంగ కళాకారులు మన్నార్గుడి ఎ.ఈశ్వరన్‌, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్‌.రమేశ్‌, తిరువారూరు వైద్యనాథన్‌లు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం