Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన రాజకీయ వారసుడుని ప్రకటించిన మాయావతి

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (14:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడుని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటించారు. తన రాజకీయ వారసుడుగా మేనల్లుడు ఆకాశా ఆనంద్ పేరును ఆమె వెల్లడించారు. ఆదివారం యూపీ రాజధాని లక్నోలో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
గత ఏడాది కాలంగా ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న చర్చకు తెరదించినట్లైంది. అలాగే, మాయావతి కూడా గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ వారసుడిని ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments