Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:12 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది.
 
నిన్న 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్ల మార్కును దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 0.48 శాతానికి పడిపోయింది.

ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ మృతుల సంఖ్యను సవరిస్తోంది. దాంతో నిన్న 356 మరణాలు నమోదుకాగా.. మొత్తంగా 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 64,75,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 102.94 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments