ఈశాన్య భారతంలో కార్చిచ్చు : బుగ్గిపాలవుతున్న అడవులు

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (15:06 IST)
ఈశాన్య భారత రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వందలాది ఎకరాల్లో అడవులను కాల్చి బూడిద చేస్తోంది. ఇటీవల నాగాలాండ్ లోని జూకో లోయలో ఈ మంటలు చెలరేగాయి. ఇవి నెమ్మదిగా మణిపూర్ వరకు విస్తరించి, చివరకు మౌంట్ ఇసో వరకు వ్యాపించాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. 
 
దాంతో పాటు సైన్యం, పారామిలటరీ బలగాల సాయమూ కోరినట్టు అధికారులు చెబుతున్నారు. నాగాలాండ్ వైపే కార్చిచ్చు చెలరేగిందని మణిపూర్‌లోని సేనాపతి జిల్లా అటవీ అధికారి చెప్పారు. గత నెల 28 నుంచి అడవి మండుతూనే ఉన్నట్టు సరిహద్దు గ్రామాల ప్రజల ద్వారా తెలుస్తోందని ఆయన చెప్పారు.
 
ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని 130 మంది ప్రజలు, అటవీ అధికారులు కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే, గాలుల వేగం, తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. కార్చిచ్చుల వల్ల చాలా వరకు వృక్ష, జంతు జాతులు బుగ్గయ్యాయని మణిపూర్ మావో మండలి పేర్కొంది. మంటలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments