గోవా ముఖ్యమంత్రి ప్రాణాలకు రక్షణ కల్పించండి : కాంగ్రెస్

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (11:22 IST)
రఫెల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వద్ద ఉన్నాయనీ, అందువల్ల ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట్రపతికి గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓ లేఖ రాసింది.
 
రఫెల్‌ ఒప్పందం వివరాలు బయటకు వస్తే అందులో అవినీతి జరిగిందని ప్రజలకు తెలుస్తుందని, అందుకే ఆ వివరాలు బయటకు రాకూడదని కోరుకునే వారు పారికర్‌కు హాని తలపెట్టే ప్రమాదముందని ఆయనకు తగిన రక్షణ కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆ లేఖలో పేర్కొంది.
 
రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు తన పడక గదిలో ఉన్నాయని మనోహర్‌ పారికర్‌ చెప్పారని గోవా మంత్రి విశ్వజిత్‌ రాణె ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా అదంతా కల్పిత ఆడియో టేప్‌ అని పారికర్‌ ఖండించారు. ఈ విషయంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య దుమారం రేగింది. లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. రఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. భాజపా నేతలు అదే స్థాయిలో కాంగ్రెస్‌పై ప్రతిదాడికి దిగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments