Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:06 IST)
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. మన్మోహన్ ఇకలేరన్న వార్త యావత్ భారతావనిని విషాదంలో ముంచెత్తింది. ప్రస్తుతం మన్మోహన్ భౌతికకాయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంది. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన పార్థివదేహంపై జాతీయ పతకాన్ని కప్పి వుంచారు. 
 
కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఆమె భారత్‌కు రావాల్సివుంది. ఆమె శనివారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
ఇక ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం తరలించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచి ఆ తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments