Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీష్ సిసోడియాకు ఏడు రోజుల కస్టడీ.. తీహార్ జైలుకు తరలింపు

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (08:28 IST)
న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ కోర్టు ఏడు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీ విధించింది. మద్యం పాలసీని ఉల్లంఘించారనే ఫిర్యాదుపై సీబీఐ 26వ తేదీన న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం అతడిని సీబీఐ కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. తదనంతరం, సిసోడియాను మరో రెండు రోజులు (మార్చి 6 వరకు) రిమాండ్ చేసేందుకు కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. 
 
సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 6న ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ సిసోడియాను హాజరుపరిచింది. ఈ కేసును విచారించిన కోర్టు సిసోడియాను మార్చి 20 వరకు తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించింది.
 
ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ ప్రత్యేక కోర్టులో విచారణకు రాగా, ఆయనకు బెయిల్ వచ్చినా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అతన్ని అరెస్టు చేయవచ్చని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో మద్యం పాలసీ ఉల్లంఘన కేసులో అరెస్టయిన మనీస్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 7 రోజుల రిమాండ్‌కు తరలించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మద్యం అవినీతి కేసులో అక్రమ నగదు బదిలీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments