Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణకాష్టంలా మారిన మణిపూర్ - మహిళా మంత్రి ఇంటికి నిప్పు

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (12:53 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఆ రాష్ట్రం ఇపుడు రావణకాష్టంలా మారింది. దీంతో ఆందోళనకారులు ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. అదేసమయంలో ఈ ఘర్షణలను అణిచివేసేందుకు సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వెస్ట్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకుని దండుగులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు హుటాహుటిన మంత్రి నివాసానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఇంటికి నిప్పు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments