మణిపూర్‌ విరిగిపడిన కొండ చరియలు - 37కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:54 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37కు చేరింది. 
 
జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇంకా 25 మంది కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వర్షాలు ఈ గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు ముగుస్తుండటంతో ఆచూకీ లభించని వారంతా మృతి చెందివుంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నట్లు తెలుస్తోంది.
 
శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 24 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 13 మంది పౌరులు ఉన్నారని గౌహతిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆచూకీ లభించని ఆరుగురు జవాన్లు, 19 పౌరుల కోసం గాలిస్తున్నామని, చివరి వ్యక్తి దొరికేవరకు చర్యలు కొనసాగుతాయన్నారు. 
 
ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments