Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పాలన.. సంక్షోభంలో మైనారిటీ పాలన: మాణిక్

Webdunia
గురువారం, 31 జులై 2014 (14:14 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో మైనారిటీల భద్రత సంక్షోభంలో పడిందని త్రిపుర ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్‌ సర్కార్‌ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే దేశంలో 12కు పైగా మత ఘర్షణలు జరిగాయని, ఇవన్నీ కూడా మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగాయని మాణిక్ వెల్లడించారు. 
 
బీజేపీకి ఆత్మగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందూత్వ భావజాలాన్ని బీజేపీపై రుద్దుతోందని వ్యాఖ్యానించారు. ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు సాధారణ ప్రజలకు నష్టం చేకూరేవిధంగా ఉన్నాయని,  రైల్వే చార్జీలు, సరుకు రవాణా చార్జీల పెంపు వల్ల సామాన్యులపై మోయలేని ఆర్థిక భారం పడిందన్నారు. 
 
అమెరికా సామ్రాజ్యవాదం వెంట మోడీ ప్రభుత్వం నడుస్తున్నదని, అందుకే పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న ఫాసిస్టు దాడులను మనదేశం ఖండించడంలేదని మాణిక్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వామపక్షాల పరిస్థితి దిగజారినా దేశంలో వామపక్షాల పాత్ర ఏమాత్రం తగ్గలేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments