Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు సాక్షిగా నిప్పు అంటించుకున్న స్త్రీపురుషుడు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:33 IST)
సుప్రీంకోర్టు సాక్షిగా ఓ పురుషుడు, స్త్రీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమకు తామే నిప్పు అంటించుకున్నారు. దీన్ని గమనించిన అక్కడున్న వారు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 
 
ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్‌ డి వద్ద సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ఘటన జరిగింది. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాజుకున్న మంటలతో సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.
 
గమనించిన అక్కడున్న వారు వెంటనే వారిపై నీళ్లు పోసి మంటలు ఆర్పారు. మంటలకు తీవ్రంగా కాలిన మహిళ ఆ వెంటనే కింద పడిపోయింది. ఆమె వెంట ఉన్న మగ వ్యక్తి కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. 
 
వెంటనే వారిద్దరిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారిద్దరు ఎవరు, ఎందుకు నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించారు అన్నది తెలియలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments