Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి నుదుట రక్తందిద్ది మరీ హత్య చేసిన ప్రియుడు...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:31 IST)
తనను నెలల తరబడి ప్రేమించి, చివరకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. పైగా, ప్రియురాలి నుదుట కుంకుమదిద్ది మరీ హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీకి చెందిన అరుణ్ గుప్తా (21), ముంబైకి చెందిన ప్రతిభా ప్రసాద్‌కు యేడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా పరిచయం ఏర్పడటంతో అది తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్ళి చేసుకునేందుకు తనతో రావాలంటూ ప్రియుడు కోరారుడు. కానీ, ఆ ప్రియురాలు మాత్రం ససేమిరా అన్నది. దీంతో ప్రియుడు ఆగ్రహించాడు. 
 
ఈ క్రమంలో వారణాసికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన అరుణ్ గుప్తా, ముంబైకి వచ్చి, కల్యాణ్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన వీరిద్దరూ శనివారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. దీంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. 
 
ఆ తర్వాత పోలీసులు వచ్చి చూడగా, ఇద్దరూ విగతజీవులై పడివున్నారు. బ్లేడ్‌తో తన చేతికి గాయం చేసుకుని, ఆమె నుదుటన సింధూరంలా దిద్ది, సెల్ఫీలు దిగి, ఆపై ప్రతిభను గొంతుపిసికి హత్య చేసిన అరుణ్, సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments