Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టిన యువకుడు (Video)

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:53 IST)
కర్నాటక రాష్ట్రంలో మొరాయించిన బైకును రిపేరు చేయలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ స్కూటర్‌ను కూడా పక్షం రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అంతలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు కోసం షోరూమ్‌కు ఇచ్చాడు. అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు.. షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈఘటన కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్‌లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలుచేశాడు. అందులో మూడు వారాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్‌ను ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. 
 
అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షోరూమ్‌లోని ఆరు స్కూటర్లు దగ్ధమైపోయాయి. 
 
షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓలా షోరూమ్ తగలబడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments