Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టిన యువకుడు (Video)

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:53 IST)
కర్నాటక రాష్ట్రంలో మొరాయించిన బైకును రిపేరు చేయలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ స్కూటర్‌ను కూడా పక్షం రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అంతలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు కోసం షోరూమ్‌కు ఇచ్చాడు. అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు.. షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈఘటన కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్‌లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలుచేశాడు. అందులో మూడు వారాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్‌ను ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. 
 
అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షోరూమ్‌లోని ఆరు స్కూటర్లు దగ్ధమైపోయాయి. 
 
షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓలా షోరూమ్ తగలబడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments