Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపేసి శవం ముందు కూర్చొన్నాడు.. కుమార్తెకు పాలు తాగించి లొంగిపోయాడు

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (12:46 IST)
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. అంతే.. భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవం ముందు 24 గంటలపాటు కూర్చుండిపోయాడు. ఆ తర్వాత రెండేళ్ళ కుమార్తెకు పాలు తాగించి పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు. ఈఘటన ఢిల్లీలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ కమలామార్కెట్ ప్రాంత నివాసి అయిన కమిల్ (24) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన రేష్మా అనే యువతిని మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ళ కుమార్తె కూడా ఉంది. 
 
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కమిల్ ఆమెతో వాగ్వాదానికి దిగుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆమెతో పెనుగులాడాడు. చివరకు భార్య ముఖానికి దిండుతో నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. 
 
ఆ తర్వాత తన కూతురితో కలిసి 24 గంటలు భార్య శవం ముందే ఉన్నాడు. అనంతరం కూతురికి పాలు తాగించిన అనంతరం పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments