Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో అక్రమ సంబంధం.. వద్దన్నా వినలేదు.. అందుకే చంపేశారా?

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:34 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు మండలంలోని యడవల్లిలోని క్వారీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. 
 
భార్యతో కలిసి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు. కానీ మంగళవారం అర్థరాత్రి చిలకలూరి పేట వద్ద హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంజనీరాజు హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. 
 
అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం నెరపాడు. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సర్దిచెప్పినా వినకుండా వదినతో వివాహేతర సంబంధం నెరపిన అంజనీరాజును హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అంజనీరాజు సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసుపై విచారణను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments