Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగబిడ్డ పుట్టలేదని భార్యను చంపేసిన భర్త

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (10:30 IST)
వరుసగా నాలుగో కాన్పులోనూ ఆడపిల్లని కనిందని, మగపిల్లాడిని కనలేదని కోపంతో ఓ వ్యక్తి తన భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకెళ్లి బావిలో తోసేసి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వడోదరకు 90 కిలోమీటర్ల దూరంలోని గోద్రా తాలుకా బగిడోల్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే మృతురాలి పేరు హేతల్ పర్మార్. ఆమె కొద్ది రోజుల క్రితమే ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. దీంతో ఈమెకు నలుగురు ఆడపిల్లలు. వరుసగా ఆడపిల్లకే జన్మనిస్తుందని... మగపిల్లాడిని కనలేదనే కోపంతో హేతల్తో ఆమె భర్త జితేంద్ర, అత్తింటివారు తరచూ గొడవపడేవారు. 
 
ఈ విషయంపై జితేంద్ర తరచూ వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నలుగురు ఆడిపిల్లలకు జన్మనిచ్చావని, కొడుకును కననందుకు భూమిపై జీవించే హక్కులేదని జితేంద్ర.. భార్యతో గొడవపడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. భార్యను హత్య చేసిన అనంతరం జితేంద్ర పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న జితేంద్రకోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments