Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలోనే భార్యను గొడ్డలితో హత్య చేశాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని?

న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పం

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (11:29 IST)
న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పంక్‌ గ్రామానికి చెందిన రమేష్‌ కంవార్‌, సంగీత చౌదరి (37)ని ప్రేమించి ఆరునెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. 
 
తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తనుంచి విడాకులిప్పించాలని సంగీత సంబల్ పూర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం దంపతులిద్దరూ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. వారికి న్యాయమూర్తులు కౌన్సిలింగ్ చేస్తుండగా, ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ గొడ్డలితో భార్య, ఆమె తల్లి లలిత, ఆమె అక్క కుమార్తె శివాని (4)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంగీతను న్యాయమూర్తులు బుర్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments