Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (09:09 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడిన ఓ భర్త.. బైకుతో పాటు బావిలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజురీబాగ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుందర్ కర్మాలి (27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని మోటారు సైకిల్‌ను బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడటంతో అతన్ని రక్షించాలని మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. ఈ ఘటనలో సుందర్ కర్మాలితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
మృతులను రాహుల్ కల్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తిని కాపాడబోయి నలుగురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments