Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (09:09 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడిన ఓ భర్త.. బైకుతో పాటు బావిలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజురీబాగ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుందర్ కర్మాలి (27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని మోటారు సైకిల్‌ను బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడటంతో అతన్ని రక్షించాలని మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. ఈ ఘటనలో సుందర్ కర్మాలితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
మృతులను రాహుల్ కల్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తిని కాపాడబోయి నలుగురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments