Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం.. రోగిపై ఆంబులెన్స్‌లో అత్యాచారం...

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తె

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:10 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ కామాంధుడు ఆంబులెన్స్ సిబ్బందిగా భావిస్తున్నారు. నగరంలోని బనశంకరి పరిధిలో రెండు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
బనశంకరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జబ్బు చేయగా, ఆస్పత్రికి తరలించేందుకు ఆమె భర్త ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించాడు. ఆమెను ఆంబులెన్స్‌లోకి ఎక్కించి బాధిత మహిళ భర్త డ్రైవర్‌ పక్కన కూర్చున్నాడు. అంబులెన్స్‌లో ఉన్న ఉద్యోగి సిద్ధరాజు బాధిత మహిళపై అత్యాచారానికి యత్నించగా, అంబులెన్సు ఆస్పత్రికి చేరుకోవడంతో అతని పన్నాగం ఫలించలేదు.
 
రెండు రోజుల అనంతరం అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ఈ ఘటనను కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో వారు బనశంకరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సిద్ధరాజును అదుపులోకి తీసుకున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments