Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను కట్నం కోసం కాలుతున్న కట్టెతో కొట్టాడు.. యాసిడ్ పోశాడు.. ముఖంపై పడిందా?

భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలాపుఝా జిల్లాకు చెందిన 31 ఏళ్ల భార్యపై భర్త, అ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (13:22 IST)
భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలాపుఝా జిల్లాకు చెందిన 31 ఏళ్ల భార్యపై భర్త, అత్త తరచూ ఘర్షణకు దిగేవారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ చితకబాదారు. తొమ్మిదేళ్ల క్రితం వీరివివాహం జరిగింది. వివాహ సమయంలో రూ .2లక్షలు, 20 నాణేల బంగారాన్ని కట్నంగా ఇస్తామని తన తల్లిదండ్రులు హామీ ఇచ్చినట్లు బాధిత మహిళ వెల్లడించింది. 
 
అయితే కేవలం బంగారం మాత్రమే ఇవ్వడంతో తనకు వేధింపులు మొదలయ్యాయి. జూన్ ఆరో తేదీ మహిళ భర్త కాలుతున్న కట్టెతో ఆమెను చితకబాదాడు. అనంతరం తీవ్ర గాయాలపాలై నేలపై పడి ఉన్న ఆమెపై యాసిడ్ పోశాడు.
 
అయితే ముఖంపై యాసిడ్ పడకుండా ఆమె తప్పించుకోగలిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో భర్త, అత్తపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments