Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భార్యను బ్లేడుతో కోశాడు, ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (20:23 IST)
వారిద్దరికి నిశ్చితార్థం అయింది. మార్చిలో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. కాబోయే అల్లుడి హోదాలో యువకుడు అత్తగారింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. పెళ్లికి ముందే అమ్మాయిని మంచిగా చూసుకుంటున్న అల్లుడిని చూసి అత్తమామలు పొంగిపోయారు.

తమ బిడ్డ అదృష్టవంతురాలంటూ మురిసిపోయారు. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ యువకుడి ఉన్మాదిగా మారి కాబోయే భార్యపైనే హత్యాయత్నం చేశాడు. బ్లేడుతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంతో బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి పంచాయతీ పరిధిలోని చింతలగుడ గ్రామానికి చెందిన డుమురి ఖొరా కూతురు సుస్మితా ఖొరాతో సొంబయి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌‌తో గతేడాది వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది మార్చి‌లో వారిద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కాబోయే భార్యను చూడాలన్న ఆత్రంతో విశ్వనాథ్ ఇటీవల అత్తారింటికి తరుచూ వెళ్తున్నాడు. నిన్న రాత్రి కూడా ఇదే మాదిరిగా వారింటికి వెళ్లి సుస్మితతో ముచ్చట్లు చెప్పాడు.
 
రాత్రి కావడంతో అక్కడే పడుకుని ఉదయం వెళ్లాలని అత్తమామలు విశ్వనాథంని కోరారు. సరేనన్న అతడు అందరితో పాటు అక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ లేచి బ్లేడుతో సుస్మితా గొంతు కోసేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
సకాలంలో వైద్యం అందడంతో ఆమె కోలుకుంది. సుస్మిత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సుస్మిత తన చిన్ననాటి స్నేహితుల గురించి ఎక్కువగా చెప్పడం, అందులో యువకులు కూడా ఉండడంతో జీర్ణించులోకపోయాడు. అందుకే ఆమెపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments