బైక్‌పై నుంచి కిందపడబోయిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:53 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటి. 
 
ఇందులోభాగంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించిన మమత బెనర్జీ.. ధరల పెంపునకు నిరసనగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఆధారిత టూ వీలర్‌పై హెల్మెట్ ధరించి, ఆమె ప్రయాణిస్తుండగా, బండి అదుపుతప్పింది. 
 
దీంతో ఆమె కిందపడబోయారు. అప్పటికే ఆమె చుట్టూ పరిగెడుతున్న భద్రతా సిబ్బంది, మమతకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా, బండిని అదుపు చేశారు. ఆపై మమతా బెనర్జీ తన రైడింగ్‌ను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.
 
కాగా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో, మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత, ఆమెను గద్దెదించి, తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments