Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీది హిరణ్యకశ్యపు కుటుంబమా? : సాక్షి మహరాజ్

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:19 IST)
వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెది రాక్షసకుటుంబం అని ఆరోపించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వారిపై బెంగాల్ సర్కారు ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. 
 
ఈ పరిణామాలపై బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ స్పందిస్తూ, బెంగాల్ రాష్ట్రంలో జై శ్రీరాం అన్నవారిపై ఆగ్రహిస్తున్నారనీ, మమతా బెనర్జీ హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందిన వారన్నారు. 
 
కృత యుగంలో ఓ రాక్షసుడు ఉండేవాడని.. అతడి పేరు హిరణ్యకశ్యపుడని.. విష్ణుమూర్తిని కొలిచినందుకు తన కుమారుడైన ప్రహ్లాదుడినే జైల్లో బంధించాడని అన్నారు. బెంగాల్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని.. దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ఆ రాక్షసుడి కుటుంబానికి చెందిన వారిలా అనిపిస్తోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments