Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహానికి ముందే కౌన్సెలింగ్ : కేరళ మహిళా కమిషన్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (12:54 IST)
కేరళ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. 
 
అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస, వరకట్న వేధింపల కేసులు భారీగా నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఉత్రా కేసు(పాముతో భార్యను చంపించిన సంఘటన), విస్మయ (వరకట్న వేధింపలతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్‌ స్టూడెంట్‌) కేసులు దేశంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌ ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేరళ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ సతీదేవి తెలిపారు. దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను ఈ కౌన్సెలింగ్‌లో వధూవరులకు వివరించనున్నట్లు ఆమె పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments