Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనతలంలో విమానం కుదుపులు.. 17 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 2 మే 2022 (10:51 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో ఈ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమాన ప్రయాణికుల్లో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ముంబై నుంచి వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ బి737లో జరిగింది. 
 
ఈ విమానం దుర్గాపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ముందు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు కూడా తెరుచుకుని, అందులోని లగేజి ప్రయాణికులపై పడింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ హఠాత్‌పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments